Hyderabad Traffic Challan: పెండింగ్ చలాన్ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది పోలీస్ శాఖ. భారీ స్థాయిలో రిబేట్ ప్రకటించింది. మార్చి ఒకటి నుంచి 30 వరకు నిర్వహించనున్న స్పెషల్ డ్రైవ్లో టూ వీలర్ వాహనదారులకు 25 శాతం, కార్లకు 50శాతం, ఆర్టీసీ బస్సులకు 30శాతం, తోపుడు బండ్లుక 20శాతం చెల్లింపుకు అవకాశం కల్పించింది. మీసేవా, ఆన్లైన్ గేవేల ద్వారా చెల్లించే ఛాన్స్ కల్పించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ.. మూడు కమిషనరేట్ల పరిధిలో 600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వీటిని క్లియర్ చేసేందుకు కొత్త ప్రతిపాదనను పోలీసు శాఖ తీసుకువచ్చింది.